Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 04:14 PM

ఉగాది పురస్కారాల్లో ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం

ఉగాది పురస్కారాల్లో ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం

ఉగాది పురస్కారాల్లో  ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం
March 22, 2026 02:21 PM 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ఉగాది పురస్కారాల సందర్భంగా చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో శ్రీ సాంస్కృతిక విశ్వకళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామ నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన ఆర్టిస్ట్ నకిరేకంటి రమేష్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. ఆయన కళా ప్రతిభను అభినందిస్తూ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు.

అదేవిధంగా కార్యక్రమంలో నాట్య ప్రదర్శనలు చేసిన నాట్యకళా విద్యార్థినులకు మెమెంటోలు, షీల్డులు అందజేశారు. ఈ వేడుక కళారంగానికి ప్రోత్సాహకంగా నిలిచిందని పాల్గొన్నవారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News