Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:14 PM

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం,జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం,జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం,జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్
January 30, 2026 09:32 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.


రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News