ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం
Biksham Goud
సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ గ్రామంలో సీసీ రహదారులు, కాలువల నిర్మాణాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె రామకృష్ణ, పిసిసి ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి