Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:40 PM

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఉండ్రుగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం
March 06, 2026 12:20 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ గ్రామంలో సీసీ రహదారులు, కాలువల నిర్మాణాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిసె రామకృష్ణ, పిసిసి ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News