గుర్రాలపాడు, l: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని గుర్రాలపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.పేద ప్రజలు అధికంగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
PRINT TIME: August 06, 2026 09:06 PM
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
13-04-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
గుర్రాలపాడు, l: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని గుర్రాలపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.పేద ప్రజలు అధికంగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి