Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 11:15 AM

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
June 01, 2026 07:18 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మన్సూరాబాద్ హిమపురి కాలనీ రోడ్ నెంబర్–2లోని గణేష్ మండపంలో జనహిత చారిటబుల్ ట్రస్ట్, శ్రీ సరిత గ్రూప్ ఆఫ్ క్లినిక్స్, క్లోవ్ డెంటల్, మాక్స్ విజన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆదివారం విశేష స్పందన లభించింది. శిబిరంలో 70 నుంచి 100 మందికి పైగా ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు.

ఈ సందర్భంగా సరిత క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, జనహిత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న వారికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సీఎన్ న్యూట్రిషన్ సెంటర్ సహకారంతో అధిక బరువుతో బాధపడుతున్న వారికి ప్రత్యేక సలహాలు, సూచనలు అందించినట్లు పేర్కొన్నారు.

అలాగే తమ సంస్థలో గైనకాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో అపార అనుభవం కలిగిన ప్రభుత్వ విశ్రాంత వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ట్రస్ట్ లక్ష్యమని వెల్లడించారు. ఆరోగ్య బీమా పథకాలపై అవగాహన, సలహాల కోసం కూడా ప్రజలు తమను సంప్రదించవచ్చని సూచించారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం మన్సూరాబాద్‌లోని వివిధ కాలనీల కమ్యూనిటీ హాళ్లలో శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హైమావతి, ఆర్థోపెడిక్ వైద్యురాలు డాక్టర్ రూబీ జోక్సన్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News