ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట (రూరల్): ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎంటీ కోఆర్డినేటర్ గుడిపుడి వెంకటేశ్వర్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాళ్లఖమ్మం పహాడ్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ మండవ వీరాంజనేయులు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ మండవ వీరాంజనేయులు మాట్లాడుతూ నిరుపేదలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్, కార్యదర్శి ఉప్పల రాజేంద్రప్రసాద్, కోశాధికారి చిలుముల శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల సుధాకర్, మాజీ సర్పంచ్ పాముల హనుమంతు, ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు శేఖర్, మౌనిక హరీష్, మధు, శ్యాంప్రసాద్, సైదులు, నాయకులు అప్పారావు, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి