Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 11:28 PM

ఉచిత మోగా వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత మోగా వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత మోగా వైద్య శిబిరానికి విశేష స్పందన
December 30, 2025 06:32 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మల్కాజిగిరి స్థానికం ప్రతినిధి

మిర్జాలగూడ జనతా క్లబ్ మరియు ముద్రగణం మనోజ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత మేఘ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన ఉచిత మేఘ వైద్య శిబిరంలో యశోద ఆసుపత్రి మరియు సోలీస్ కంటి ఆస్పత్రుల సహకారంతో నిర్వహించిన బిపి, షుగర్, దంతా మరియు కంటి పరీక్షల శిబిరంలో సుమారు 1000 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు అర్హులైన 600 మందికి కంటి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలు మరియు రక్త పరీక్షల నమూనా సేకరించామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనతా క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ మరియు ముద్రగణం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మిర్జాల్‌గూడ లో గల సర్వే నంబర్ 894 లో 418 గజాల స్థలం జనతా క్లబ్ పేరు మీద ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా ఈ స్థలంలో భూమి పూజ చేసి ఒక ఆసుపత్రిని నిర్మాణం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జనతా క్లబ్ అధ్యక్షులు జి రామకృష్ణ, ముద్రగణం మనోజ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మనోజ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనతా క్లబ్ అధ్యక్షులు జి రామకృష్ణ, ముద్రగణం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మనోజ్ కుమార్ యాదవ్, జనతా క్లబ్ కార్యదర్శి కేజీ అశోక్ కుమార్, కోశాధికారి పెరుమాళ్, ఉపాధ్యక్షులు షికారి అరవింద్ యాదవ్ తోపాటు సభ్యులు కామేశ్వరరావు, M.S రమేష్, డానియల్ జయరాజ్, అరుణ్ కుమార్, ఎన్ గోపాల్లతోపాటు స్థానిక నాయకులు యశోద ఆసుపత్రి వైద్యులు సోలిస్ కంటి ఆసుపత్రి వైద్యులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News