ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి
ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి
Sthanikam District Staff Reporter
రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి అని కోదండరామ్ ను కోరిన
-తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, నిరసనలు చేసి, జైలుకు వెళ్ళి ఆరోగ్యాలు,ఆర్ధిక,శారీరకంగా,నష్టపోయి నేడు తిరుగలేని పరిస్థితులలో కొందరు యున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామి గురించి రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి కోదండరామ్ అంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మా అందరి బాధలు చెప్పామని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజు “ఛలో హైద్రాబాద్” కార్యక్రమములో ఆగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా పూస శ్రీనివాస్ మాట్లాడుతు గత ప్రభుత్వం 2014 నుండి 2018 వరకు ఉద్యమకారులను పట్టించుకోలేదని 2018న రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి ఉ ద్యమకారులకు 250 చ.గజాల స్థలము,రూ॥ 30,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డులు,ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ ను అభ్యర్ధించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్,బుర్రి అయిలయ్య,గోపరాజు గణేష్,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి