PRINT TIME: May 27, 2026 04:04 AM
టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
March 19, 2026 05:27 PM
36 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బీబీనగర్ మండల పరిధిలోని నెమరగోముల గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కొలిచెలిమే సురేష్, తన మిత్రుడు ఘంటా శ్రావణ్ కుమార్తో కలిసి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను మరియు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు వారి అభినందనలను స్వీకరించి, యువజన నాయకులకు భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి