Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:58 PM

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య
January 19, 2026 06:35 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతిరిది బండి కిరణ్

తుంగతుర్తి;    టి డబ్ల్యూ జేఎఫ్ సూర్యాపేట జిల్లా అడ హక్ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మ రంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండలానికి విచ్చేసిన జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య మాట్లాడుతూ  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈనెల 23న జరగబోయే సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభను జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు , హెల్త్ కార్డుల మంజూరి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవలసినదిగా కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసుల ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అడ హాక్ కమిటీ సభ్యులు మూషం హరిప్రసాద్, లింగాల సాయిబాబు గౌడ్ , శ్రీరాముల కృష్ణ, వంగాల వెంకన్న, తుంగతుర్తి మండల విలేకరులు ఎండి నజీర్, ఓరుగంటి శ్రీనివాస్, గుండ గాని రామకృష్ణ , తడక మల్ల సురేష్ , తడక మల్ల రమేష్, షేక్ జానీ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News