తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న న్యాల్కల్ శివమాల భక్తులు
తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న న్యాల్కల్ శివమాల భక్తులు
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, న్యాల్కల్ మండలం నుంచి శివమాలలు ధరించిన భక్తులు మంగళవారంమహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాల్కల్ మండల పరిధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యాత్రగా బయలుదేరిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.
అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆనందోత్సాహాలతో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా తుల్జాభవాని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతున్నామని భక్తులు తెలిపారు.
శివమాలలు ధరించిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో మార్మోగింది. భక్తుల నినాదాలు, భజనలు, హారతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి కృపతో తమ యాత్ర సాఫీగా సాగుతుందని, కుటుంబాలకు శుభఫలితాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.
అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ యాత్రను కొనసాగించారు. ఈ యాత్ర న్యాల్కల్ మండల భక్తుల మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచిందని స్థానికులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి