Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న న్యాల్కల్ శివమాల భక్తులు

తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న న్యాల్కల్ శివమాల భక్తులు

తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్న న్యాల్కల్ శివమాల భక్తులు
February 10, 2026 08:12 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, న్యాల్కల్ మండలం నుంచి శివమాలలు ధరించిన భక్తులు మంగళవారంమహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాల్కల్ మండల పరిధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యాత్రగా బయలుదేరిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు.

అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆనందోత్సాహాలతో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా తుల్జాభవాని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని యాత్ర ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతున్నామని భక్తులు తెలిపారు.

శివమాలలు ధరించిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో మార్మోగింది. భక్తుల నినాదాలు, భజనలు, హారతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి కృపతో తమ యాత్ర సాఫీగా సాగుతుందని, కుటుంబాలకు శుభఫలితాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.

అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ యాత్రను కొనసాగించారు. ఈ యాత్ర న్యాల్కల్ మండల భక్తుల మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచిందని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News