PRINT TIME: March 23, 2026 01:15 PM
తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం
తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం
March 23, 2026 11:16 AM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్,
స్కూల్కు సక్రమంగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మి–రాజు దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు హాజరు కావడం లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.
దీనిపై ఆగ్రహించిన తండ్రి రాజు కుమారుడిని మందలించగా, మనస్తాపానికి గురైన చెన్నకేశవరెడ్డి ఫిబ్రవరి 20న ‘దుకాణానికి వెళ్లి వస్తాను’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి