ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రజాశాంతి, భద్రత దృష్ట్యా 144 సెక్షన్ విధిస్తూ తహశీల్దార్ వై. నాగమణి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆమె తెలిపారు.
ఈ ఆదేశాల ప్రకారం చట్ట విరుద్ధమైన సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించడం, ఆయుధాలు కలిగి ఉండటం నిషేధం. అలాగే ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకేచోట గుమికూడడాన్ని కూడా నిషేధించారు.
ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వై. నాగమణి హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి