తిరుమలగిరి పురపాలక సంఘానికి నూతన పాలకవర్గం
తిరుమలగిరి పురపాలక సంఘానికి నూతన పాలకవర్గం
Biksham
చైర్మన్గా సంకేపల్లి రఘునందన్ రెడ్డి గారు – ఉప చైర్మన్గా ఏమోజు గోవిందమ్మ
తిరుమలగిరి పురపాలక సంఘ చైర్మన్గా సంకేపల్లి రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉప చైర్మన్గా ఏమోజు గోవిందమ్మ ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.స్థానిక పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన చైర్మన్, ఉప చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, సభ్యులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు.ఉప చైర్మన్ ఏమోజు గోవిందమ్మ మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మహిళల సాధికారత, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి తిరుమలగిరి పురపాలక సంఘాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి