Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం
19-03-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: ఉగాది పండుగ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన స్వగృహంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పరాభవ నామ సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది పండుగ తీపి–చేడు అనుభవాల సమ్మేళనమని, ప్రతి మనిషి జీవితంలో సంతోషాలు, కష్టాలు రెండూ సమానంగా ఉంటాయని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టే ఉగాది రైతులకు ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, సాగునీరు–తాగునీటి సదుపాయాలు మెరుగై పచ్చని పంటలతో తెలంగాణ రాష్ట్రం నిత్యవసంతంగా మారిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో అనుబంధ వృత్తులు బలపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని తెలిపారు.

తెలంగాణ సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఇంటిల్లిపాదిగా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

Sthanikam

తీపి–చేడు సమ్మేళనమే ఉగాది: ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్: ఉగాది పండుగ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన స్వగృహంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పరాభవ నామ సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగాది పండుగ తీపి–చేడు అనుభవాల సమ్మేళనమని, ప్రతి మనిషి జీవితంలో సంతోషాలు, కష్టాలు రెండూ సమానంగా ఉంటాయని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

వ్యవసాయ సంవత్సరానికి శ్రీకారం చుట్టే ఉగాది రైతులకు ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, సాగునీరు–తాగునీటి సదుపాయాలు మెరుగై పచ్చని పంటలతో తెలంగాణ రాష్ట్రం నిత్యవసంతంగా మారిందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధితో అనుబంధ వృత్తులు బలపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టమైందని తెలిపారు.

తెలంగాణ సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఇంటిల్లిపాదిగా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News