తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కమ్మ జన సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉన్నం సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఎన్టీఆర్కే దక్కిందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని పేర్కొన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ జన సేవా సమితి సభ్యులు శంకర్ ప్రసాద్, దారపు నేని శ్రీనివాసరావు, రవీంద్రబాబు, ఆంజనేయులు, శంకర్ ప్రసాద్, నాగేశ్వరరావు, వెంకటరమణ, మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి