Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ – ఉన్నం సత్యనారాయణ రావు
January 18, 2026 01:28 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని కమ్మ జన సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉన్నం సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన చరిత్ర ఎన్టీఆర్‌కే దక్కిందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని పేర్కొన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఎన్టీఆర్ నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ జన సేవా సమితి సభ్యులు శంకర్ ప్రసాద్, దారపు నేని శ్రీనివాసరావు, రవీంద్రబాబు, ఆంజనేయులు, శంకర్ ప్రసాద్, నాగేశ్వరరావు, వెంకటరమణ, మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News