Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:08 AM

తెలంగాణలో జర్నలిజం గౌరవం నిలబెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు”

తెలంగాణలో జర్నలిజం గౌరవం నిలబెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు”

తెలంగాణలో జర్నలిజం గౌరవం నిలబెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు”
January 12, 2026 05:41 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:రాష్ట్ర ప్రభుత్వము జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టడం ముఖ్యమని, వృత్తికి చెందిన ప్రతి జర్నలిస్ట్‌కి అన్ని విధాలా మద్దతు ఇవ్వబడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి ప్రకారం, అక్రిడిటేషన్ కార్డులు తక్కువగా ఇవ్వబడ్డాయన్న ప్రచారం వాస్తవానికి సరి కాదు. గతంలో ఉన్న సుమారు 23 వేల కార్డుల కంటే ఈసారి ఎక్కువ కార్డులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు.జీవో 252లో మార్పులు చేర్పులు చేసి జర్నలిస్ట్ సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని, అన్ని వాస్తవ సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మీడియా కార్డు మరియు అక్రిడిటేషన్ కార్డు మధ్య ఎలాంటి తేడా లేకపోవడంతో, కార్డు పొందిన ప్రతి జర్నలిస్ట్‌కు సమాన ప్రయోజనాలు అందుతాయని కూడా చెప్పారు.ఇండ్ల స్థలాల విషయంలో, కోర్టు అడ్డంకులు లేకుండా ఒక ప్రత్యేక విధానం రూపొందిస్తామని, మహిళా జర్నలిస్ట్‌ల కోసం ప్రత్యేక కోటా కేటాయిస్తామని, క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ సౌకర్యం తప్పక ఉంటుందని హామీ ఇచ్చారు.సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, శాఖ అధికారులు, CPRo తదితరులు పాల్గొన్నారు. మంత్రి స్పష్టం చేసిన విధంగా, అన్ని నిర్ణయాలు నిజమైన జర్నలిస్టులకే న్యాయం జరిగేలా తీసుకోవడానికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News