Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:09 AM

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!
December 09, 2025 12:37 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ క్రైమ్ బ్యూరో స్థానీకం:

అరె, హైదరాబాద్ నడిబొడ్డున మల్కాజిగిరి ఏరియాల ఘోరం జరిగింది. వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు దారుణంగా నడిరోడ్డు మీదనే వేసిపారేసిన్రు. ఈ ఘటన జవహర్‌నగర్ సాకేత్ కాలనీల కలకలం రేపింది.

ఎవరీ వెంకటరత్నం? ఎందుకీ హత్య? పోలీసోళ్లు చెప్తున్న ముచ్చట ప్రకారం, ఈ వెంకటరత్నం మీద గతంలనే రెండు జాయింట్ మర్డర్ కేసులు ఉన్నాయట. ముఖ్యంగా ధూల్‌పేట ఏరియాల జరిగిన జంట హత్యల కేసుల ఈయన ప్రధాన నిందితుడు. గిదే పాత కక్షలు మనోడి ప్రాణం మీదకు తెచ్చినయని అనుమానిస్తున్నరు.

అసలేం జరిగింది? నిన్న పొద్దుగాల (సోమవారం) వెంకటరత్నం తన బిడ్డను స్కూల్ కాడ దింపి టూవీలర్ మీద ఇంటికి వస్తుంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఓ ఆటోల, బైక్ మీద వచ్చిన దుండగులు అడ్డగించిన్రు.

మొదట బండిని గుద్ది కిందపడేసిన్రు.

లేవకముందే కత్తులతోటి పొడిచి, రాళ్లతోటి తల మీద మోది, ఆఖరుకు తుపాకీతోటి కాల్చి చంపేసిన్రు.

ఎవరు చంపిన్రు? సీసీటీవీల రికార్డయిన ఫుటేజీ చూస్తుంటే, ఇది పక్కా పాత కక్షలనే అనిపిస్తాంది. వచ్చినోళ్లు మంగళ్‌హాట్ ఏరియాోళ్లని పోలీసులు అనుమానిస్తున్నరు. పాత గొడవల బాకీ తీర్చుకోవడానికే ఈ స్కెచ్ వేసినట్టు ఉంది. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది, దుండగుల కోసం గాలింపు మొదలువెట్టిన్రు.


మొత్తానికి పాత పాపం ఊరికే పోదు అన్నట్టు, ఆనాడు చేసిన హత్యలే ఈనాడు వెంకటరత్నం ప్రాణం తీసినయని జనాలు అనుకుంటున్నరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News