Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:56 AM

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!
December 09, 2025 12:37 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ క్రైమ్ బ్యూరో స్థానీకం:

అరె, హైదరాబాద్ నడిబొడ్డున మల్కాజిగిరి ఏరియాల ఘోరం జరిగింది. వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు దారుణంగా నడిరోడ్డు మీదనే వేసిపారేసిన్రు. ఈ ఘటన జవహర్‌నగర్ సాకేత్ కాలనీల కలకలం రేపింది.

ఎవరీ వెంకటరత్నం? ఎందుకీ హత్య? పోలీసోళ్లు చెప్తున్న ముచ్చట ప్రకారం, ఈ వెంకటరత్నం మీద గతంలనే రెండు జాయింట్ మర్డర్ కేసులు ఉన్నాయట. ముఖ్యంగా ధూల్‌పేట ఏరియాల జరిగిన జంట హత్యల కేసుల ఈయన ప్రధాన నిందితుడు. గిదే పాత కక్షలు మనోడి ప్రాణం మీదకు తెచ్చినయని అనుమానిస్తున్నరు.

అసలేం జరిగింది? నిన్న పొద్దుగాల (సోమవారం) వెంకటరత్నం తన బిడ్డను స్కూల్ కాడ దింపి టూవీలర్ మీద ఇంటికి వస్తుంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఓ ఆటోల, బైక్ మీద వచ్చిన దుండగులు అడ్డగించిన్రు.

మొదట బండిని గుద్ది కిందపడేసిన్రు.

లేవకముందే కత్తులతోటి పొడిచి, రాళ్లతోటి తల మీద మోది, ఆఖరుకు తుపాకీతోటి కాల్చి చంపేసిన్రు.

ఎవరు చంపిన్రు? సీసీటీవీల రికార్డయిన ఫుటేజీ చూస్తుంటే, ఇది పక్కా పాత కక్షలనే అనిపిస్తాంది. వచ్చినోళ్లు మంగళ్‌హాట్ ఏరియాోళ్లని పోలీసులు అనుమానిస్తున్నరు. పాత గొడవల బాకీ తీర్చుకోవడానికే ఈ స్కెచ్ వేసినట్టు ఉంది. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది, దుండగుల కోసం గాలింపు మొదలువెట్టిన్రు.


మొత్తానికి పాత పాపం ఊరికే పోదు అన్నట్టు, ఆనాడు చేసిన హత్యలే ఈనాడు వెంకటరత్నం ప్రాణం తీసినయని జనాలు అనుకుంటున్నరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News