Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:20 PM

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!

తుపాకీతో కాల్చి.. బండరాయితో మోది.. వెంకటరత్నం దారుణ హత్య!
December 09, 2025 12:37 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ క్రైమ్ బ్యూరో స్థానీకం:

అరె, హైదరాబాద్ నడిబొడ్డున మల్కాజిగిరి ఏరియాల ఘోరం జరిగింది. వెంకటరత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని దుండగులు దారుణంగా నడిరోడ్డు మీదనే వేసిపారేసిన్రు. ఈ ఘటన జవహర్‌నగర్ సాకేత్ కాలనీల కలకలం రేపింది.

ఎవరీ వెంకటరత్నం? ఎందుకీ హత్య? పోలీసోళ్లు చెప్తున్న ముచ్చట ప్రకారం, ఈ వెంకటరత్నం మీద గతంలనే రెండు జాయింట్ మర్డర్ కేసులు ఉన్నాయట. ముఖ్యంగా ధూల్‌పేట ఏరియాల జరిగిన జంట హత్యల కేసుల ఈయన ప్రధాన నిందితుడు. గిదే పాత కక్షలు మనోడి ప్రాణం మీదకు తెచ్చినయని అనుమానిస్తున్నరు.

అసలేం జరిగింది? నిన్న పొద్దుగాల (సోమవారం) వెంకటరత్నం తన బిడ్డను స్కూల్ కాడ దింపి టూవీలర్ మీద ఇంటికి వస్తుంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఓ ఆటోల, బైక్ మీద వచ్చిన దుండగులు అడ్డగించిన్రు.

మొదట బండిని గుద్ది కిందపడేసిన్రు.

లేవకముందే కత్తులతోటి పొడిచి, రాళ్లతోటి తల మీద మోది, ఆఖరుకు తుపాకీతోటి కాల్చి చంపేసిన్రు.

ఎవరు చంపిన్రు? సీసీటీవీల రికార్డయిన ఫుటేజీ చూస్తుంటే, ఇది పక్కా పాత కక్షలనే అనిపిస్తాంది. వచ్చినోళ్లు మంగళ్‌హాట్ ఏరియాోళ్లని పోలీసులు అనుమానిస్తున్నరు. పాత గొడవల బాకీ తీర్చుకోవడానికే ఈ స్కెచ్ వేసినట్టు ఉంది. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది, దుండగుల కోసం గాలింపు మొదలువెట్టిన్రు.


మొత్తానికి పాత పాపం ఊరికే పోదు అన్నట్టు, ఆనాడు చేసిన హత్యలే ఈనాడు వెంకటరత్నం ప్రాణం తీసినయని జనాలు అనుకుంటున్నరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News