తాటిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి
తాటిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండలం తాటిపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఆటో, కారును ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం, న్యాల్కల్ మండలం తాటిపల్లి చౌరస్తా వద్ద ఆటో వాహనం ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మల్లేష్ రెడ్డి (35) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి