తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు
స్థానికం బృందం
నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ పది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం స్థానిక నాయకులు వెంకటయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు చరవాణి ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్, దంతూరి శంకర్ గౌడ్, నిమ్మల కృష్ణ గౌడ్, రంగు సైదులు గౌడ్, రంగు రాములు గౌడ్, కప్పల వెంకన్న గౌడ్, కప్పల సైదులు గౌడ్, కప్పల సత్యనారాయణ గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, రంగు బిక్షం గౌడ్, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి