ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బింగి చంద్రయ్య (53) తాటి చెట్టు పైనుంచి జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలకెళ్తే రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కిన సమయంలో అకస్మాత్తుగా కాలుజారి పడిపోయాడు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగోల్లోని సుప్రజా ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రకారం చంద్రయ్యకు ఎడమ చేయి విరగడంతో పాటు వెనుక నడుము భాగంలో కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి