రామన్నపేట: లక్ష్మాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి పడి గాయపడ్డాడు. భీమగోని వెంకటేశం గౌడ్ (48) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తాటి చెట్టు ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు సమాచారం.
ఈ ఘటనలో అతనికి కాళ్లు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్గొండ ఆసుపత్రికి తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి