తాతయ్య స్మరణలో మాగంటి నాని ఘన విరాళం — ఆలయ అభివృద్ధికి 50 వేల రూపాయలు అందజేత
తాతయ్య స్మరణలో మాగంటి నాని ఘన విరాళం — ఆలయ అభివృద్ధికి 50 వేల రూపాయలు అందజేత
GADDAM JAGANMOHAN REDDY
నరసాపురంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది
విస్సన్నపేట మండలంలో భావోద్వేగం, భక్తి, దాతృత్వం కలగలిసిన అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. నరసాపురం శ్రీ సూర్యలక్ష్మీనారాయణ దేవాలయం అభివృద్ధి కోసం టిడిపి యువ నాయకుడు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి) తన తాతయ్య మాగంటి సత్యనారాయణ చౌదరి జ్ఞాపకార్థం 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావుకు అధికారికంగా అందించారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తమ కుటుంబం ఎప్పుడూ దేవతారాధనను జీవితంలో భాగంగా భావిస్తుందని, సంపాదనలో కొంత భాగాన్ని దైవ కార్యాలకు వినియోగించాలన్నది తన తండ్రి శోభన ప్రసాద్ ఆశయం అని తెలిపారు. ఆ మార్గాన్ని కొనసాగిస్తూ తాను కూడా సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. “మానవ సేవే మాధవ సేవ” అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు సాగితే జీవితంలో అనుకోని అవకాశాలు, మంచి పరిచయాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో నాని కుటుంబ సభ్యులు సుభాషిణి, ప్రసాద్ తదితరులు ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవతామూర్తులకు పూలమాలలు సమర్పించడంతో పాటు పసుపు, కుంకుమలు, జాకెట్ ముక్కలు, పూజా సామాగ్రిని ఆలయానికి అందజేశారు. పూజారులకు వస్త్రాలు, కానుకలు సమర్పించి ఆధ్యాత్మిక సేవలో భాగమయ్యారు.
ధర్మకర్త గోటేటి సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ మాగంటి కుటుంబం తరతరాలుగా దాతృత్వం, భక్తి పరంపరను కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఘనంగా సాగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల సాన్నిధ్యంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి