Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:25 AM

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!
March 25, 2026 09:21 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

8 సంవత్సరాల క్రితం జిల్లాలో సంచలన సృష్టించిన పలకూరి లింగస్వామి హత్య కేసులో నల్లగొండ SC/ST ప్రత్యేక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తలమండెం వేరుచేసి బొట్టుగూడా చౌరస్తా జెండా దిమ్మపై పెట్టిన దారుణ ఘటనకునిందితుడు మహమ్మద్ ధర్వేష్ మోహియుద్దీన్ (అలియాస్ నాయబ్)కు జీవిత ఖైదు శిక్ష విధించారు. 2018లో జరిగిన ఈ ఘటన అప్పట్లో జిల్లాను తీవ్రంగా కలచివేసింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన లింగస్వామి హత్యకు నిందితులు మొహసిన్ ఖాన్, మహమ్మద్ ధర్వేష్. హత్య తర్వాత తలను వేరుచేసి చౌరస్తా జెండా దిమ్మపై పెట్టడం ద్వారా సంచలనం సృష్టించారు. నల్లగొండ జిల్లా పోలీసులు సంచలన కేసుగా స్వీకరించి, అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.

ఎస్సీ/ఎస్టీప్రత్యేక సెషన్స్ కోర్టు ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి, A-1 నిందితుడు మొహసిన్ ఖాన్ ఇప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించింది. A-2 నిందితుడు మహమ్మద్ ధర్వేష్ మోహియుద్దీన్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. 8 సంవత్సరాల దీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు బయటపడటంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాధితకుటుంబ సభ్యులు ఈ తీర్పుతో న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. "8 ఏళ్ల నుంచి ఈ కేసు కోసం ఎదురుచూశాం. పోలీసులు, కోర్టు అందించిన న్యాయానికి కృతజ్ఞతలు" అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా పోలీసులకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు పోలీసుల త్వరిత చర్యలకు, కోర్టు న్యాయానికి నిదర్శనంగా మారింది.

ఈ ఘటన సమయంలో జిల్లాలో భీతి, అస్థిరత కలిగించింది. పోలీసులు త్వరగతిలో నిందితులను పట్టుకుని, సంక్లిష్ట దర్యాప్తుతో ఆధారాలు సేకరించారు. కోర్టు తీర్పు దీర్ఘకాలం ఎదురుచూసిన కుటుంబానికి సమాధానంగా నిలిచింది. నల్లగొండలో ఈతీర్పు చర్చనీయాంశంగా మారి, న్యాయ విధానం పట్ల విశ్వాసాన్ని పెంచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News