Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె.. ఇంట్లోనే పాతిపెట్టి సిమెంటుతో పూడ్చివేత స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 11:11 PM

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!

తలమొండెం వేరుచేసిన సంచలన హత్యకేసు: 8 ఏళ్ల తర్వాత నల్లగొండ కోర్టు జీవిత ఖైదు!
March 25, 2026 09:21 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

8 సంవత్సరాల క్రితం జిల్లాలో సంచలన సృష్టించిన పలకూరి లింగస్వామి హత్య కేసులో నల్లగొండ SC/ST ప్రత్యేక సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తలమండెం వేరుచేసి బొట్టుగూడా చౌరస్తా జెండా దిమ్మపై పెట్టిన దారుణ ఘటనకునిందితుడు మహమ్మద్ ధర్వేష్ మోహియుద్దీన్ (అలియాస్ నాయబ్)కు జీవిత ఖైదు శిక్ష విధించారు. 2018లో జరిగిన ఈ ఘటన అప్పట్లో జిల్లాను తీవ్రంగా కలచివేసింది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన లింగస్వామి హత్యకు నిందితులు మొహసిన్ ఖాన్, మహమ్మద్ ధర్వేష్. హత్య తర్వాత తలను వేరుచేసి చౌరస్తా జెండా దిమ్మపై పెట్టడం ద్వారా సంచలనం సృష్టించారు. నల్లగొండ జిల్లా పోలీసులు సంచలన కేసుగా స్వీకరించి, అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.

ఎస్సీ/ఎస్టీప్రత్యేక సెషన్స్ కోర్టు ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి, A-1 నిందితుడు మొహసిన్ ఖాన్ ఇప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించింది. A-2 నిందితుడు మహమ్మద్ ధర్వేష్ మోహియుద్దీన్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. 8 సంవత్సరాల దీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పు బయటపడటంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాధితకుటుంబ సభ్యులు ఈ తీర్పుతో న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. "8 ఏళ్ల నుంచి ఈ కేసు కోసం ఎదురుచూశాం. పోలీసులు, కోర్టు అందించిన న్యాయానికి కృతజ్ఞతలు" అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా పోలీసులకు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు పోలీసుల త్వరిత చర్యలకు, కోర్టు న్యాయానికి నిదర్శనంగా మారింది.

ఈ ఘటన సమయంలో జిల్లాలో భీతి, అస్థిరత కలిగించింది. పోలీసులు త్వరగతిలో నిందితులను పట్టుకుని, సంక్లిష్ట దర్యాప్తుతో ఆధారాలు సేకరించారు. కోర్టు తీర్పు దీర్ఘకాలం ఎదురుచూసిన కుటుంబానికి సమాధానంగా నిలిచింది. నల్లగొండలో ఈతీర్పు చర్చనీయాంశంగా మారి, న్యాయ విధానం పట్ల విశ్వాసాన్ని పెంచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News