Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:55 AM

తాజోద్దీన్ మెమోరియల్ టోర్నమెంట్ రాయిపల్లి గ్రామానికి క్రీడా చరిత్రలో ఒక గుర్తింపు

తాజోద్దీన్ మెమోరియల్ టోర్నమెంట్ రాయిపల్లి గ్రామానికి క్రీడా చరిత్రలో ఒక గుర్తింపు

తాజోద్దీన్ మెమోరియల్ టోర్నమెంట్ రాయిపల్లి గ్రామానికి క్రీడా చరిత్రలో ఒక గుర్తింపు
January 17, 2026 08:31 PM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఎస్ఐ కోటేశ్వరరావు:“యువతలో క్రీడా చైతన్యం పెంపొందించాలి”

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం, మానూర్ మండలం పరిధిలోని రాయిపల్లి గ్రామంలో ఈ నెల జనవరి 10వ తేదీన ప్రారంభమైన తాజోద్దీన్ మెమోరియల్ టోర్నమెంట్ అత్యంత ఘనంగా మరియు విజయవంతంగా ముగిసింది. గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను గ్రామ యువకుల మేనేజ్‌మెంట్ బృందం ఆమేర్, సద్దాం, జాకీర్, హైమద్ ఆధ్వర్యంలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌కు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించగా, మొత్తం 28 టీములు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఫైనల్ వరకు ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఆటగాళ్లు క్రమశిక్షణతో, క్రీడా నైపుణ్యంతో ఆడుతూ మంచి ఆటతీరును ప్రదర్శించారు.పలు రోజుల పాటు సాగిన మ్యాచ్‌ల అనంతరం, జనవరి 17వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించబడింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్కంఠభరితమైన పోరులో రాయికోడ్ టీం ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచింది. విజేతలైన రాయికోడ్ టీంకు మొదటి బహుమతిగా రూ. 22,222 నగదు మరియు ట్రోఫీని గ్రామ సర్పంచ్ సల్మా బేగం ఖమర్ రాయికోడ్ టీం కెప్టెన్ కుమార్ కు ఘనంగా అందజేశారు.ఈ సందర్భంగా విజేత టీంకు గ్రామస్తులు ఘనంగా అభినందనలు తెలిపారు.అలాగే టోర్నమెంట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచిన నవీన్ టీం కు రెండవ బహుమతిగా రూ. 11,111 నగదును గ్రామ మాజీ సర్పంచ్ రాంచేందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుండాలని, క్రీడల ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు.ఈ ఫైనల్ మ్యాచ్ మరియు బహుమతి ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానూర్ మండల్ సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, మాజీ కోఆప్షన్ నెంబర్ తదితర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.టోర్నమెంట్ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షించారు. నిర్వాహకులు ఆటగాళ్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో టోర్నమెంట్ ప్రశాంతంగా, విజయవంతంగా సాగింది.చివరగా ఈ టోర్నమెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఆమేర్, సద్దాం, జాకీర్, హైమద్లతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రామ పెద్దలు, యువత మరియు క్రీడాభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. తాజోద్దీన్ మెమోరియల్ టోర్నమెంట్ రాయిపల్లి గ్రామంలో క్రీడా చైతన్యానికి నిదర్శనంగా నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News