- ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
భువనగిరి మండల పరిధిలోని తాజ్పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రంజాన్ సందర్భంగా తోఫా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టతో ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ సమాజం శాంతి,సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్,గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,మజీద్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి