తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం
తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం
Krishna
సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత్రి కవితమ్మ హాజరై పటాన్చెరు టౌన్తో పాటు సంగారెడ్డి టౌన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు తెలంగాణ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి పాల్గొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమన్ పాటిల్, సాయి తేజ, విట్టల్ చారి (మాజీ ఎంపీటీసీ), మాణిక్య ముదిరాజ్, మోహన్ నాయక్, ఆరిఫ్, ఇస్మాయిల్, బాపు రాజు, సుధాకర్, నరసారెడ్డి, బసవరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి