Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:57 AM

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన

తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన
March 24, 2026 07:09 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేయడం మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటనలో భాగంగా వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియపై ప్రాయోగిక అవగాహన పొందారు.

కార్యక్రమంలో టీఎన్‌జీసీ కోఆర్డినేటర్ సూర్యకిరణ్, కళాశాల ప్రిన్సిపల్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల మురళి, ఈకో క్లబ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొని వివరించారు.

ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోజువారీ జీవితంలో తడి-పొడి చెత్త వేరు చేసే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేష్ కూడా చెత్త నిర్వహణ పద్ధతులపై వివరించారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు ప్రభాకర్, మాధవి, శ్రీశైలం, అంజయ్య, రమేష్, శ్రీనివాస్, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ రాంపల్లి కృష్ణ ఉప సర్పంచ్ అందే మల్లేష్ ,వార్డ్ సభ్యులు జక్కుల మల్లేష్, కొండమడుగు అశోక్, ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కంచుగల్ల కృష్ణయ్య తోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ పల్లెర్ల కుమార్ వాత్సల్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొని తడి చెత్త పొడి చెత్త ఫీల్డ్ ట్రిప్ ను విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News