తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన
తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేయడం మరియు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ క్షేత్ర పర్యటనలో భాగంగా వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియపై ప్రాయోగిక అవగాహన పొందారు.
కార్యక్రమంలో టీఎన్జీసీ కోఆర్డినేటర్ సూర్యకిరణ్, కళాశాల ప్రిన్సిపల్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల మురళి, ఈకో క్లబ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొని వివరించారు.
ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోజువారీ జీవితంలో తడి-పొడి చెత్త వేరు చేసే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేష్ కూడా చెత్త నిర్వహణ పద్ధతులపై వివరించారు.
కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు ప్రభాకర్, మాధవి, శ్రీశైలం, అంజయ్య, రమేష్, శ్రీనివాస్, ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ రాంపల్లి కృష్ణ ఉప సర్పంచ్ అందే మల్లేష్ ,వార్డ్ సభ్యులు జక్కుల మల్లేష్, కొండమడుగు అశోక్, ముత్తిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కంచుగల్ల కృష్ణయ్య తోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ పల్లెర్ల కుమార్ వాత్సల్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మొదలైన వారు పాల్గొని తడి చెత్త పొడి చెత్త ఫీల్డ్ ట్రిప్ ను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి