Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 11:13 AM

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షమే

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షమే

టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షమే
June 01, 2026 04:43 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాజీలేని పోరు

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపుదలకు శిక్షణ తరగతులు


టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల సమస్యలపై ఎల్లప్పుడూ రాజీలేనిపోరు సల్పుతోందని, జర్నలిస్టుల పక్షాన అర్థ శతాబ్ద కాలంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీనియర్ జర్నలిస్టులు ఎస్కే ఆసిఫ్, ఎస్కే అహ్మద్ లకు యూనియన్ సభ్యత్వం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల పక్షపాతిగా యూనియన్ పేరు పొందిందని చెప్పారు. పాలకులు ఎవరైనా, ప్రభుత్వం ఏదైనా జర్నలిస్టులను పక్షాన నిలబడి కలబడే సంఘం ఒకే ఒక్క టీయూడబ్ల్యూజే ఐజేయు అని స్పష్టం చేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందజేసే బాధ్యత జిల్లా మీడియా కమిటీ లో మెజార్టీ సభ్యులుగా ఉన్న టి యు డబ్ల్యూ జే ఐజేయు తీసుకుంటుందని వివరించారు. అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర యూనియన్ నాయకత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, అందుకు అనుగుణంగా సూర్యాపేట జిల్లాలో కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలోని జర్నలిస్టులకు వృత్తిపరంగా నైపుణ్యం పెంపొందించే విధంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు.. జిల్లాలో చేపట్టిన యూనియన్ సభ్యత్వ నమోదుకు జర్నలిస్టుల నుంచి భేషైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు

సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్టులు షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, షేక్ జహీర్, కొండ్లె కృష్ణయ్య, సురేందర్, రామచంద్ర రాజు, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, పోలోజు సందీప్, వెంకట్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News