Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 26, 2026 09:43 PM

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి - పూస శ్రీనివాస్
February 26, 2026 08:06 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయములో ఇచ్చిన వాగ్ధానములను నెరవేర్చాలని “తెలంగాణ ఉద్యమకారుల సంఘం" రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరినారు. గురువారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్.వి. హోటల్లో ఉద్యమకారుల సమావేశములో మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్షలు, రైల్రోకోలు, జైలుకు పోయిన ఉద్యమకారులకు రేవంత్రెడ్డి మాట ఇచ్చారని తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల స్థలం,పెన్షన్ రూ॥3000, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారని తెలంగాణ హైకోర్టు కూడ ఇండ్ల స్థలం,పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినదని,వెంటనే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి అత్యవసర మంత్రివర్గ సమావేశము ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మాణం చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని పూస శ్రీనివాస్ డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు,ముష్కె జయపాల్రెడ్డి,డి.ఎస్.మాణిక్యమ్మ, పంజాల శ్రీనివాస్ గౌడ్,కొడిమాల కృష్ణ, సుర్వి శ్రీనివాస్ గౌడ్,గొర్ల లక్ష్మణ్,ఊదరి బాలమల్లేష్ యాదవ్, బండిరాజుల సుమన్,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News