న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్గా బదిలీ చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
గవర్నర్ల బదిలీలపై రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి