తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.
Biksham
స్థానికం ప్రతినిధి బిక్షం
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నియామకం పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన బాధ్యత ఇంచార్జ్పై ఉందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ , జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి