Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 11:25 AM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహాగ్రంథమని అన్నారు. ఆ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, రాజ్యాంగ ఆత్మను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ భాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు పాల్గొన్నారు.అలాగే పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, వల్లాల సైదులు, శుంకరబోయిన రాజు, లింగాల సైదులు, బోడపట్ల మధు, అనపర్తి రాజేష్, కడియం వంశీ, మామిడి ఉదయ్, మామిడి శోభన్, నెలచర్ల మధు ప్రజాప్రతినిధి తదితర నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News