తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన మహాగ్రంథమని అన్నారు. ఆ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, రాజ్యాంగ ఆత్మను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ భాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు పాల్గొన్నారు.అలాగే పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, వల్లాల సైదులు, శుంకరబోయిన రాజు, లింగాల సైదులు, బోడపట్ల మధు, అనపర్తి రాజేష్, కడియం వంశీ, మామిడి ఉదయ్, మామిడి శోభన్, నెలచర్ల మధు ప్రజాప్రతినిధి తదితర నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ ఐక్యత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి