Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 25, 2026 09:15 PM

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు పదవీకాలం పొడిగింపు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు పదవీకాలం పొడిగింపు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు పదవీకాలం పొడిగింపు
February 25, 2026 07:33 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పదవీకాలాన్ని పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఆయన 2028 వరకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. మీడియా రంగంలో దీర్ఘకాల అనుభవం, అకాడమీ కార్యకలాపాల విస్తరణలో చూపిన చురుకుదనం, జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తన పదవీకాలంలో అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణా శిబిరాలు, వర్క్‌షాప్‌లు, నూతన మీడియా ధోరణులపై అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాల వారీగా మీడియా ప్రతినిధులకు వివిధ సంక్షేమ పథకాలను చేరువ చేశారు. డిజిటల్ మీడియా ప్రోత్సాహానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.పదవీకాల పొడిగింపుపై స్పందించిన శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి, మీడియా ప్రమాణాల పెంపు కోసం కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటంతో జర్నలిస్టు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అకాడమీ మరింత చురుకుగా పనిచేసి మీడియా రంగానికి బలాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News