తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్త నియామకం
తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్త నియామకం
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
తెలంగాణ జాగృతి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్తను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాల సమస్యలను అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందించడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గుడుగుంట్ల మహేష్ గుప్తను కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల తెలంగాణ జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత బలంగా వెలుగులోకి వస్తాయని, వారి హక్కుల సాధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గుడుగుంట్ల మహేష్ గుప్త మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి