టెకుల సోమరం: గ్రామ పంచాయతీ కార్యాలయంలో నీలిమ హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ పనుమటి మమత నరేందర్ రెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
శిబిరంలో గ్రామ ప్రజలు పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్ కూపన్లు అందజేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారగోని అశోక్ గౌడ్, వార్డు సభ్యులు దండబోయిన శారద, చేగురి నరసింహ, రాజమల్లు, చేగురి గోపాల్, కలుకూరి వెంకటేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి