స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి
స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి
Biksham
యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా యువత స్వశక్తితో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలనిసూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి చౌరస్తా వద్ద “మామ 90 కిచెన్”ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ప్రైవేట్ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి యువత చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితే ఆర్థిక స్వావలంబన సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బైరు శైలేందర్, కుమ్మరికుంట్ల వేణు, కొండపల్లి దిలీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జహీర్, పందిరి మల్లేష్, చెంచాల నిఖిల్ నాయుడు, కొడకండ్ల ఉపేందర్ రెడ్డి, టైసన్, నిర్వాహకులు ఉయ్యాల ప్రభు కుమార్, శ్రీకాంత్, ఎల్గూరి యాదగిరి, ఎల్గూరి బాలు వెంకన్న, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి