Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:54 AM

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

స్వామి వివేకానంద జయంతి వేడుకలు
January 13, 2026 05:48 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు

-భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,

-జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

జాతీయ యువజన దినోత్సవం 2026 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం భువనగిరి పట్టణలోని వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి హాజరయ్యారు.భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...స్వామి వివేకానంద భారత దేశంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు,అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడని,బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా,చిలిపిగా ఉండేవాడు. యువకులు అందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతురావు మాట్లాడుతూ...స్వామి వివేకానంద ఆటలలోనూ,చదువులో ముందుండేవాడని,పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు అతని జ్ఞాపకశక్తి అమోఘమైనదని యువతకు స్వామి వివేకానంద ఏన్నో ప్రభోదలు చేసి ఆ ప్రబోధాలు యువతను అలవర్చుకోవాలన్నారు.జిల్లా యువజన మరియు క్రీడాల అదికారి ధనంజనేయులు మాట్లాడుతూ...స్వామి వివేకానంద గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం,బోధనలను గౌరవించడానికి భారత దేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అత్యున్నత లక్ష్యానికి జీవితానాంత ధారపోయామని సందేశాన్నిచ్చిన్న సంస్కరణవాది, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన విశ్వమానవుడు వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,మున్సిపల్ కమిషనర్ రామలింగం,జిల్లా యువజన మరియు క్రీడల అదికారి ధనంజనేయులు,ఎస్.సి కార్పొరేషన్ ఈ.డీ శ్యామ్ సుందర్,జిల్లా యువజన సంఘం నాయకుడు కరుణ్,జిల్లాలోని ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువతీ యువకులు క్రీడా సంఘాల ప్రతినిధులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News