Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:45 PM

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

స్వామి వివేకానంద జయంతి వేడుకలు
13-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు

-భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,

-జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

జాతీయ యువజన దినోత్సవం 2026 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం భువనగిరి పట్టణలోని వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి హాజరయ్యారు.భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...స్వామి వివేకానంద భారత దేశంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు,అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడని,బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా,చిలిపిగా ఉండేవాడు. యువకులు అందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతురావు మాట్లాడుతూ...స్వామి వివేకానంద ఆటలలోనూ,చదువులో ముందుండేవాడని,పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు అతని జ్ఞాపకశక్తి అమోఘమైనదని యువతకు స్వామి వివేకానంద ఏన్నో ప్రభోదలు చేసి ఆ ప్రబోధాలు యువతను అలవర్చుకోవాలన్నారు.జిల్లా యువజన మరియు క్రీడాల అదికారి ధనంజనేయులు మాట్లాడుతూ...స్వామి వివేకానంద గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం,బోధనలను గౌరవించడానికి భారత దేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అత్యున్నత లక్ష్యానికి జీవితానాంత ధారపోయామని సందేశాన్నిచ్చిన్న సంస్కరణవాది, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన విశ్వమానవుడు వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,మున్సిపల్ కమిషనర్ రామలింగం,జిల్లా యువజన మరియు క్రీడల అదికారి ధనంజనేయులు,ఎస్.సి కార్పొరేషన్ ఈ.డీ శ్యామ్ సుందర్,జిల్లా యువజన సంఘం నాయకుడు కరుణ్,జిల్లాలోని ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువతీ యువకులు క్రీడా సంఘాల ప్రతినిధులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Article Image

స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు

-భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,

-జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

జాతీయ యువజన దినోత్సవం 2026 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం భువనగిరి పట్టణలోని వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఆవేస్ చిస్తి హాజరయ్యారు.భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...స్వామి వివేకానంద భారత దేశంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు,అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడని,బాలుడిగా ఉన్నపుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా,చిలిపిగా ఉండేవాడు. యువకులు అందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.జిల్లా కలెక్టర్ హనుమంతురావు మాట్లాడుతూ...స్వామి వివేకానంద ఆటలలోనూ,చదువులో ముందుండేవాడని,పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు అతని జ్ఞాపకశక్తి అమోఘమైనదని యువతకు స్వామి వివేకానంద ఏన్నో ప్రభోదలు చేసి ఆ ప్రబోధాలు యువతను అలవర్చుకోవాలన్నారు.జిల్లా యువజన మరియు క్రీడాల అదికారి ధనంజనేయులు మాట్లాడుతూ...స్వామి వివేకానంద గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం,బోధనలను గౌరవించడానికి భారత దేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అత్యున్నత లక్ష్యానికి జీవితానాంత ధారపోయామని సందేశాన్నిచ్చిన్న సంస్కరణవాది, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన విశ్వమానవుడు వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,మున్సిపల్ కమిషనర్ రామలింగం,జిల్లా యువజన మరియు క్రీడల అదికారి ధనంజనేయులు,ఎస్.సి కార్పొరేషన్ ఈ.డీ శ్యామ్ సుందర్,జిల్లా యువజన సంఘం నాయకుడు కరుణ్,జిల్లాలోని ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువతీ యువకులు క్రీడా సంఘాల ప్రతినిధులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News