సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ప్రారంభం
సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ప్రారంభం
Biksham Goud
వ్యాపారాభివృద్ధికి కొత్త ఊపు – గృహ అవసరాలకు ఒకే చోట పరిష్కారం
సూర్యాపేట పట్టణం వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గృహ అవసరాలకు సంబంధించిన గ్రానైట్, మార్బుల్ సామగ్రి ఒకే చోట అందుబాటులోకి రావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని అరవై అడుగుల రహదారిపై ఏర్పాటు చేసిన శ్రీ హర్ష మార్బుల్ నూతన దుకాణాన్ని ఆదివారం ప్రారంభించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది మాట్లాడుతూ సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ఏర్పాటుతో స్థానికులకు నాణ్యమైన సామగ్రి సులభంగా లభిస్తుందని తెలిపారు. ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు అన్నారు. గృహ నిర్మాణ రంగంలో వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. దుకాణ యజమానులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల గ్రానైట్ రాళ్లు, మార్బుల్ రాళ్లు, గృహ అలంకరణ సామగ్రిని సరసమైన ధరలకు అందించనున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి