సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ
సూర్యాపేట నియోజకవర్గం గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ
Biksham
సూర్యాపేట పట్టణంలోని బాషానాయక్ తండాలో కీ.శే. గుగులోతు హుస్సేన్ నాయక్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్సేన్ నాయక్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ భూక్యా కౌసల్య, 13వ వార్డు అధ్యక్షులు కస్పరాజు రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షులు బైరు నాగరాజు, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు బంధం విష్ణు నాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాపర్తి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు సాయిప్రకాష్, సోమ్ల గూగుల్ శ్రీకాంత్, ధరావత్ బాలు నాయక్, ధరావత్ సురేష్, బాల నరసింహ నాయక్, బానోత్ నరసింహ నాయక్, హుస్సేన్ గూగుల్త్, మనోహర్, షేక్ రహీం, కోడి కిరణ్, తలారి రాజు, నర్సింగ్ కిరణ్, నూకల మనోజ్, మధు, పిల్లల నాగరాజు, లింగ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి