సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది బాధ్యతల స్వీకారం
సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది బాధ్యతల స్వీకారం
Biksham Goud
వేద మంత్రాలతో ఆశీర్వాదం… భారీగా తరలివచ్చిన కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు
సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వేద పండితులు వేదమంత్రాల మధ్య ఆశీర్వాదం అందజేశారు. నూతన చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత–లక్ష్యాది మాట్లాడుతూ ఐదేళ్ల పాలనకు అందరూ అండగా ఉండాలని కోరారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యతల స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్లు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తొలి సంతకంగా 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలోని 48 వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలో విలీనం అయినప్పటికీ శివారు ప్రాంతాలు ఇంకా గ్రామాల రూపంలోనే ఉన్నాయని, అక్కడి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి