Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:25 PM

సూర్యాపేట బస్టాండ్‌లో మరుగుదొడ్ల కష్టాలు

సూర్యాపేట బస్టాండ్‌లో మరుగుదొడ్ల కష్టాలు

సూర్యాపేట బస్టాండ్‌లో మరుగుదొడ్ల కష్టాలు
May 05, 2026 05:46 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులు మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో మహిళలకు కేటాయించిన మరుగుదొడ్లు మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, ప్రత్యామ్నాయంగా పురుషుల విభాగాన్ని మహిళలకు కేటాయించారు. దీంతో పురుష ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇక సరైన నిర్వహణ లేకపోవడంతో మరుగుదొడ్ల వద్ద దుర్వాసన వ్యాపిస్తుండగా, మహిళలు కూడా ఉపయోగించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. శుభ్రత లోపం, నీటి సౌకర్యాల కొరత కారణంగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా, బస్టాండ్ ఎదురుగా ఉన్న పే అండ్ యూస్ మరుగుదొడ్లు కూడా మూసివేయబడటంతో యువత, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్లను మరమ్మతు చేయించడంతో పాటు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ వంటి ప్రజా ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News