సూర్యాపేట బస్టాండ్లో మరుగుదొడ్ల కష్టాలు
సూర్యాపేట బస్టాండ్లో మరుగుదొడ్ల కష్టాలు
Biksham
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ప్రయాణికులు మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లో మహిళలకు కేటాయించిన మరుగుదొడ్లు మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, ప్రత్యామ్నాయంగా పురుషుల విభాగాన్ని మహిళలకు కేటాయించారు. దీంతో పురుష ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇక సరైన నిర్వహణ లేకపోవడంతో మరుగుదొడ్ల వద్ద దుర్వాసన వ్యాపిస్తుండగా, మహిళలు కూడా ఉపయోగించడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. శుభ్రత లోపం, నీటి సౌకర్యాల కొరత కారణంగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా, బస్టాండ్ ఎదురుగా ఉన్న పే అండ్ యూస్ మరుగుదొడ్లు కూడా మూసివేయబడటంతో యువత, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరుగుదొడ్లను మరమ్మతు చేయించడంతో పాటు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బస్టాండ్ వంటి ప్రజా ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి