PRINT TIME: May 07, 2026 11:24 PM
సూర్యాపేట అభివృద్ధిపై మంత్రితో సర్వోత్తమ్ రెడ్డి చర్చ
సూర్యాపేట అభివృద్ధిపై మంత్రితో సర్వోత్తమ్ రెడ్డి చర్చ
March 13, 2026 05:46 PM
200 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
కామేపల్లి మండలంలోని పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చర్చించారు.
ఈ సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.
ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి