PRINT TIME: March 20, 2026 09:47 PM
సూరారపు పరీక్షన్ రాజ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం
సూరారపు పరీక్షన్ రాజ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం
March 20, 2026 08:26 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud
సూర్యాపేటకు చెందిన సూరారపు పరీక్షన్ రాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శుక్రవారం నియమితులయ్యారు. జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు, వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్సారి చేతుల మీదుగా రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సూరారపు పరీక్షన్ రాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి