నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం విప్గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంగళవారం ఘనంగా సత్కరించారు. సుక్క శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిరిపురం డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వీరేశం విప్గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏప్రిల్ 14న సిరిపురం గ్రామంలో నిర్వహించనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.
కార్యక్రమంలో సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, గాదె యాదగిరి, గాదె శంకరయ్య, మామిడి పెంటయ్య, బల్గురి రమేష్, గాదె రమేష్, సురేష్, అరవింద్, నంది పాటి అనిల్, మణి, చంద్రశేఖర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి