Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:00 AM

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
March 24, 2026 03:21 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

మంగళవారం మోత్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పప్పులు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. అన్నం సరిగా వండకపోతే వెంటనే సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి బియ్యం మార్చుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు.

విద్యార్థులకు సరిపడా భోజనం, పాలు సమయానికి అందుతున్నాయా అని ఆరా తీశారు. వంటగదిలో తయారైన ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, శుభ్రతతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై వారి సన్నద్ధతను తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News