Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:45 AM

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ
20-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News