Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:08 PM

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ

సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ
May 20, 2026 09:47 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News