సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ
సోషల్ మీడియా వేధింపులపై ఆగ్రహం.. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య విమర్శ
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తమపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు ప్రతిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పందించిన తన వ్యక్తిగత సహాయకుడు (పిఏ) సందీప్ను పోలీస్ స్టేషన్కు పిలిపించడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.సోషల్ మీడియాలో మొదటగా అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటికి సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఒత్తిడితోనే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించేప్రయత్నాలుజరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉందని, రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.వెంటనే సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి