Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:52 PM

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు
February 10, 2026 06:38 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీ హెచ్ హన్మంతరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం విస్తృత స్థాయిలో సిబ్బందిని నియమించి, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.పట్టణంలో మొత్తం నలభై ఎనిమిది వార్డులు ఉండగా, ఇందుకోసం నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం అరవై మూడు బూతులు ఉండగా, సమస్యాత్మక బూతులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల విధుల్లో నూట అరవై ఐదు మంది పోలింగ్ అధికారులు, నూట అరవై ఐదు మంది సహాయ పోలింగ్ అధికారులు, ప్రతి బూత్‌కు ముగ్గురు చొప్పున మొత్తం నాలుగు వందల తొంభై ఐదు మంది ఓపీలు విధులు నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతి బూత్‌కు ఒక్కరు చొప్పున నూట అరవై ఐదు మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.వీరితో పాటు మున్సిపల్ వార్డు అధికారులు, బూత్ స్థాయి అధికారులు, పోలీసు సిబ్బంది, ఆశా కార్యకర్తలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా పదహారు మంది రూట్ అధికారులు, నలభై మంది రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది మొత్తం ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారని కమిషనర్ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News