Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:38 AM

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు
February 10, 2026 06:38 PM 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీ హెచ్ హన్మంతరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం విస్తృత స్థాయిలో సిబ్బందిని నియమించి, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.పట్టణంలో మొత్తం నలభై ఎనిమిది వార్డులు ఉండగా, ఇందుకోసం నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం అరవై మూడు బూతులు ఉండగా, సమస్యాత్మక బూతులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల విధుల్లో నూట అరవై ఐదు మంది పోలింగ్ అధికారులు, నూట అరవై ఐదు మంది సహాయ పోలింగ్ అధికారులు, ప్రతి బూత్‌కు ముగ్గురు చొప్పున మొత్తం నాలుగు వందల తొంభై ఐదు మంది ఓపీలు విధులు నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతి బూత్‌కు ఒక్కరు చొప్పున నూట అరవై ఐదు మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.వీరితో పాటు మున్సిపల్ వార్డు అధికారులు, బూత్ స్థాయి అధికారులు, పోలీసు సిబ్బంది, ఆశా కార్యకర్తలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా పదహారు మంది రూట్ అధికారులు, నలభై మంది రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది మొత్తం ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారని కమిషనర్ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News