Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:22 PM

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు

సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు
February 10, 2026 06:38 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీ హెచ్ హన్మంతరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం విస్తృత స్థాయిలో సిబ్బందిని నియమించి, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.పట్టణంలో మొత్తం నలభై ఎనిమిది వార్డులు ఉండగా, ఇందుకోసం నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం అరవై మూడు బూతులు ఉండగా, సమస్యాత్మక బూతులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల విధుల్లో నూట అరవై ఐదు మంది పోలింగ్ అధికారులు, నూట అరవై ఐదు మంది సహాయ పోలింగ్ అధికారులు, ప్రతి బూత్‌కు ముగ్గురు చొప్పున మొత్తం నాలుగు వందల తొంభై ఐదు మంది ఓపీలు విధులు నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతి బూత్‌కు ఒక్కరు చొప్పున నూట అరవై ఐదు మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.వీరితో పాటు మున్సిపల్ వార్డు అధికారులు, బూత్ స్థాయి అధికారులు, పోలీసు సిబ్బంది, ఆశా కార్యకర్తలు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. అదనంగా పదహారు మంది రూట్ అధికారులు, నలభై మంది రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది మొత్తం ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నారని కమిషనర్ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News