Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:23 PM

సూర్యాపేట అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం

సూర్యాపేట అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం

సూర్యాపేట అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం
February 07, 2026 01:32 PM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

42, 27వ వార్డుల్లో జోరుగా ఎన్నికల ప్రచారం

సూర్యాపేట: సూర్యాపేట పట్టణ అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 42వ వార్డు అభ్యర్థి చల్లమల్ల నరసింహ, 27వ వార్డు అభ్యర్థి కుంచం దుర్గ గెలుపుకోసం ఆయన ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1995 నుంచి 2005 మధ్య కాలంలో పట్టణంలో నిర్మించిన సిసి రహదారులు, బిటి రహదారులు, కృష్ణా జలాల సరఫరానే నేటికీ సూర్యాపేట అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. గత పాలకులు పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో సూర్యాపేటను రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి 42వ వార్డు అభ్యర్థి చల్లమల్ల నరసింహ, 27వ వార్డు అభ్యర్థి కుంచం దుర్గలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News