సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు
సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు
Prakash
సోమందేపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా బదిలీలలో భాగంగా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు భగవాన్, దిలీప్, మధునాయక్ బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో వారికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సబ్-ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ యాదవ్ వారికి రిలీవింగ్ ఆర్డర్స్ అందజేసి, వారి సేవలను గుర్తిస్తూ దుశ్శాలువలతో సత్కరించారు.
స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ, భగవాన్, దిలీప్, మధునాయక్ తమ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, వారి భవిష్యత్ విధుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి