Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:35 AM

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు
08-04-2026 249 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా బదిలీలలో భాగంగా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు భగవాన్, దిలీప్, మధునాయక్ బదిలీపై వెళ్లారు.

ఈ సందర్భంగా సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో వారికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సబ్-ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ యాదవ్ వారికి రిలీవింగ్ ఆర్డర్స్ అందజేసి, వారి సేవలను గుర్తిస్తూ దుశ్శాలువలతో సత్కరించారు.

స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ, భగవాన్, దిలీప్, మధునాయక్ తమ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, వారి భవిష్యత్ విధుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు

Article Image

సోమందేపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా బదిలీలలో భాగంగా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు భగవాన్, దిలీప్, మధునాయక్ బదిలీపై వెళ్లారు.

ఈ సందర్భంగా సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో వారికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సబ్-ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ యాదవ్ వారికి రిలీవింగ్ ఆర్డర్స్ అందజేసి, వారి సేవలను గుర్తిస్తూ దుశ్శాలువలతో సత్కరించారు.

స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ, భగవాన్, దిలీప్, మధునాయక్ తమ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, వారి భవిష్యత్ విధుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News